Devotional Articles


20 ఫిబ్రవరి 2025 ️ కాలాష్టమి, శబరి జయంతి గురువారం గ్రహ బలం పంచాంగం గురువారం గ్రహాధిపతి గురువు (బృహస్పతి). గురువు యొక్క అధిష్టాన దైవం
"శ్రీ ఇంద్రుడు"
మరియు "శ్రీ దక్షిణామూర్తి". గురువు అనుగ్రహం కొరకు గురువారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం బృహస్పతయే నమః || 2. ఓం ఇంద్రాయ నమః ||3. ఓం దక్షిణామూర్తయే నమః ||
4. ఓం విష్ణవే నమః || 5. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ||
శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై వుంటారు. గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయం సందర్శించండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. గురువారాల్లో శివాలయంతో పాటు, శ్రీ మహా విష్ణు,..

మాఘమాసం - విశేష తిథులు మాఘ విశిష్టతను గురించి.... మాఘ శుద్ధ పాడ్యమి నుండి
మాఘ శుద్ధ నవమి వరకు - శ్యామలాదేవి నవరాత్రులు
జరుపుకోవడం ఆనవాయితీ. మాఘమాసంలో ..... శుద్ధ విదియ నాడు బెల్లం,
ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు.
శుద్ధ చవితి న ఉమా పూజ,
వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితి నాడు
చేసే తిలదానానికి, గొప్ప పుణ్యఫలం చెప్పారు. శుద్ధ పంచమిని శ్రీపంచమి
అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష
ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతి కామదహనోత్సవం అనే పేర..

మాఘ పూర్ణిమ ప్రత్యేకత ?చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.కార్తీక మాసం
దీపాలకూ, దీపారాధనలకు ప్రసిద్ధి.మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి."మా - అఘం'' అంటే పాపం
యివ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు. "మాఘమాసేరటం తాప్యః
కించి దభ్యుదితే రవౌ బ్రహ్మఘ్నం వా సురాపం
వా కంపతంతం పునీమహే''"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే, అనగా ... బ్రాహ్మీముహూర్తమునుంచి జలములన్నియు బ్రహ్మహత్య, సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టిమానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును'' అని అర్థం.అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు...

కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్ష మవుతారు???నాగసాధువులకి ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒక్కసారి చూద్దాం!!హరిద్వార్ లోనూ, త్రివేణి
సంగమం లోనూ, ఉజ్జయిని లోను, నాసిక్ లోను జరిగే కుంభమేళా లలో లక్షలాది మంది నాగసాధువులు
రావటం మనం టీవీల్ల, పేపర్ లలో చూశాం. నాగ సాధువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో
హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో వుంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా
జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి. ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి..

ముక్కోటి ఏకాదశి / వైకుంఠ ఏకాదశిప్రతి ఏట ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశీని ‘వైకుంఠ ఏకాదశి ‘ పండుగగా పరిగణిస్తారు.ముక్కోటిఏకాదశి నాడు అన్ని వైషవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు, దేవయానం, పితృయానం అంటారు. ఉత్తరాయణంలో దేవయానంలో మరణించినవారు సూర్యమండలాన్ని , భేదించుకుని వెళ్లి మోక్షాన్ని పొందుతారు. దక్షిణాయనంలో పితృయానంలో పోయినవారు చంద్రమండలానికి చేరి, మళ్లీ జన్మిస్తారు. అందుకే భీష్ముడు&n..

మహా మృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి? ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?అసలు ఈ మంత్రానికి అర్ధం ఏమిటి ? ఈ మంత్రం మరణాన్ని జయిస్తుందా ?” ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టి వర్ధనం! *ఉర్వారుకమివ బంధనాన్, మృత్యోర్ ముక్షీయ మామృతాత్!!“*ప్రతి పదార్ధం: ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే, ప్రణవ నాదము; త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; యజామహే = పూజించు చున్నాము; సుగంధిం = సుగంధ భరితుడు;పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించువాడు; ఉర్వారుకం = దోస పండు; ఇవ = వలె;&nbs..

తిరునల్లార్ దర్భేశ్వర శనీశ్వర స్వామి..............!!( పుష్యమాసం శని ఆరాధన చాలా పవిత్రం )తిరునల్లార్ దర్భేశ్వర శనీశ్వర స్వామి వారికి, పార్వతీ పరమేశ్వరుల ఆదేశానుసారం; మొదటగా నల తీర్థంలో స్నానం చేసి, తడి బట్టలతో, మొదటిగా ధర్భేశ్వర స్వామి వారికి అభిషేకం తరవాత, ప్రాననాదీని అమ్మకి కుంకుమార్చన తర్వాత, శనీశ్వర స్వామి మూల మూర్తికి పాలు, పెరుగు, నువ్వుల నూనె, గందోధక మహా అభిషేకం చేయించాలి. తర్వాత కాకులకు నువ్వులు కలిపిన అన్నం వేసి, తర్వాత మళ్ళీ నల తీర్థంలో స్నానం చేసి, మన ఒంటి మీద ఉన్న బట్టలు వదిలేయాలి. ఇది నియమం.స్థల పురాణమునల మహారాజుకు శని బాధలు తొలగిన ప్రదేశంలో, కొలువై ఉన్న..

శివుడిని పూజించేటప్పుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పొరపొట్లు..!!హిందూ పురాణాల ప్రకారం, సోమవారం శివుడికి ప్రత్యేకం. మీకు తెలుసా ? శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. శి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, వ అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల, ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటాడని వేదాలు వివరిస్తాయి.శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి.అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తల..

సంక్రాంతి ముందు ధనుర్మాసం లో మాత్రమే, హరిదాసులు కనపడతారు. మళ్ళీ సంవత్సరం దాకా రారు...శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే, మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగి పోతాయి.హరిదాసు అనగా పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకుని, వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని, దీవించేవారు హరిదాసులు.నెలరోజులు పాటు హరినామాన్ని గానం చేసినందుకు, చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య , వస్తు దానాలను స్వీకరిస్తారు. Shop Now For Sankranthi Special :https://www.epoojastore.com/special-items/sankranthi-specialsహరిదాసులు తమ తలపై ధరించే పంచల..

1-1-2025 నుండి పుష్యమాసం ప్రారంభంచంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి, అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్..

విశ్వరూప వీరభద్రుడు...శ్రీ శైల క్షేత్ర పాలకుడు.......!!శివుడి జట నుంచి ఉద్భవించిన వీరభద్రస్వామి శ్రీశైలానికి క్షేత్రపాలకుడు.
ఇక్కడ ఆయన అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. ఊరిబయట బయలు వీరభద్రస్వామిగా, ఆలయంలో జ్వాలా
వీరభద్రుడిగా, పుష్కరిణికి దగ్గరలో ఆరామవీరభద్రుడిగా, ఘంటామఠం వద్ద జటావీరభద్రుడిగా
కనిపించే ఈ స్వామి మల్లికార్జున స్వామివారి ముఖమండపంలో ఎడమవైపు విశ్వరూపంతో దర్శనమిస్తారు.
శివలింగ చిహ్నలాంఛితమైన కిరీటాన్ని తలపై ధరించి సర్వాభరణాలంకృతుడై, మోకాలివరకూ వేలాడే
కపాలమాలతో, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో గొడ్డలి అదేవిధంగా కుడివైపు పదిహేను చేతులతో,
ఎడమవైపు పదిహేను చేతులతో అనేక ఆయుధాలను ధరించి ఈ స్..

మంగళ, శుక్రవారాలలో ఇతరులకు
డబ్బు ఎందుకు ఇవ్వకూడదా....? కారణం ఏమిటి...?మంగళ వారం
కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం
చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 6కుజుడు
కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు
శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు
చేయకూడదు.ముఖ్యంగా
మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు . మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా
మిగిలే ప్రమాదం ఉంది. ..

జనవరి 29 నుండి దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలుతిరుపతి, 2024 డిసెంబరు 21: కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి
ఆలయంలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు జనవరి
28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ
ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది.
రూ.300/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీ
సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భక్త..

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈఓ సమీక్ష23న వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్లు విడుదల24న ఎస్ఈడీ టికెట్లు విడుదలతిరుమల, 2024 డిసెంబరు 17: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారి
ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన
ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్యతో
కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు- 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 1..